సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతిలోని ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఎఎస్టీఎఫ్) కార్యాలయం వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 5.30గంటల సమయంలో అక్మస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడి చెట్లు కాలిపోసాగాయి. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్సు సిబ్బంది ఎస్పీ శ్రీనివాస్ కు సమాచారం అందజేశారు. ఆయన ఆదేశాలతో వెంటనే ఫైర్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్న టాస్క్ ఫోర్సు సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పారు. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి కారణాలపై విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ మంటలకు బాధ్యులయి ఉండవచ్చునని భావిస్తున్నారు.
===============