సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్-శ్రీశైలం రోడ్డు మార్గాన్ని మెరుగుపర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ ఫారెస్ట్ చెక్పోస్టు నుంచి శ్రీశైలం వరకు అత్యంత పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తే రాత్రి వేళల్లో సైతం ఎలాంటి అడ్డంకులు లేకుండా శ్రీశైలం వెళ్లేందుకు వీలవుతుంది. హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉన్నందున ప్రస్తుతం మన్ననూరు చెక్పోస్టు నుంచి రాత్రి వేళల్లో ప్రయాణాలను అనుమతించడం లేదు.ప్రస్తుతం ఆ మార్గంలో 70 కి.మీ. మేర డబుల్ లేన్ మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ అవసరాలకు సరిపోవడం లేదు. ఈ మార్గాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ నల్లమల అటవీ ప్రాంతం కావడంతో అనుమతులు లభించడంలేదు. ఈ నేపథ్యంలో మన్ననూర్ చెక్పోస్టు నుంచి నల్లమల అటవీ ప్రాంతం మీదుగా శ్రీశైలం వరకు 4 లేన్లతో 70 కి.మీ. పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని రాష్ట్ర ఆర్అండ్బీ శా ఖ కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది.