సిరా న్యూస్;
అయిజ పట్టణంలోని సీడ్స్ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వానాకాలం ప్రారంభం కావడంతో రైతులు పత్తి మిరప కంది ఆముదం వంటి విత్తనాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీడ్స్ దుకాణాల్లో బ్రాండెడ్ విత్తనాలను అమ్మకాలు చేయాలని టాస్క్ ఫోర్స్ అధికారులు దుకాణాల యజమానులను ఆదేశిస్తున్నారు. రైతులకు నకిలీ విత్తనాలను అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని అలంపూర్ తాలూకా టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు నాగేశ్వరరావు హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు ఒరిజినల్ రసీదులు తప్పనిసరిగా అందజేయాలని యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఏవో శంకర్ లాల్, హెడ్ కానిస్టేబుల్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
=======================