Kalaveni Srinivas: ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరం : ఓదెల డెవలప్ మెంట్ ఫోరం కలవేని శ్రీనివాస్

సిరా న్యూస్, ఓదెల
ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరం : ఓదెల డెవలప్ మెంట్ ఫోరం కలవేని శ్రీనివాస్

సామాన్యుని ఆ వేదన కంటే ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరం ఓదెల డెవలప్ మెంట్ ఫోరం కలవేని శ్రీనివాస్ అన్నారు. శ‌నివారం ఓదెలలో శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంద‌న్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్రభుత్వం మారినప్పుడల్లా రాష్ట్ర చిహ్నాలు మార్చడం సరైనది కాదని తెలిపారు. రాష్ట్రంలో పేదవాడి స్థితిగతులు మార్చండి, పని చేసుకునే వాడికి పని కల్పించడం ప్రభుత్వ హక్కు అని తెలిపారు. ఆ హక్కును నోటుతో ఓటుని కొని పేదవాడిని ఇంకా పేదవాడిగా చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం మారింది… పాలన మారింది. ఇకనైనా పని చేసుకునే వారి కోసం రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.సమాజంలో సామాన్యుని ఆవేదన కంటే ఒక మేధావి మౌనం చాలా ప్రమాదకరమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *