చంద్రబాబుతో మాజీ మంత్రి రామచంద్రయ్య భేటీ

సిరా న్యూస్,బద్వేలు;

విదేశీ పర్యటనను ముగించు కుని హైదరాబాద్ ఉంచి విజయవాడ వచ్చిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో శనివారం తెదేపా మాజీ మంత్రివర్యులు & పార్లమెంట్ సభ్యులు సి. రామచంద్రయ్య కలిశారు.అయన తనయుడు యువ నాయకుడు సి విష్ణు స్వరూప్ తో మర్యా దపూర్వకంగా కలిశారు. కడప రాజంపేట పార్లమెంటు స్థానాలతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో జరిగిన పోలింగ్ వివరాలను విపులంగా చంద్రబాబు వివరించినట్లు రామచంద్రయ్య తెలిపారు. కడప రాజంపేట మైదుకూరు స్థానాలలో టిడిపి తప్పక గెలిచి తీరుతామని రాయచోటి కోడూరు జమ్మలమడుగులలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. కడప పార్లమెంటు పరిధిలో క్రాస్ ఓటింగ్ మెండుగా జరిగిందని టిడిపి ఎంపీ అభ్యర్థి కూడా విజయావకాశాలు ఉన్నాయని చెప్పినట్లు తెలిపారు. 2019 కన్నా 2024లో పోలింగ్ శాతం అధికంగా జరిగిందని యువకులు బయట ప్రాంతాల వారు ఉద్యోగులు 70 శాతం వరకు తెలుగుదేశం అయితే ఓట్లు వేయడం జరిగిందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే కచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని ముందుగానే చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *