సిరాన్యూస్, హుస్నాబాద్:
వైభవంగా ఆంజనేయస్వామి కళ్యాణ మహోత్సవం
* హాజరైన శ్రీశ్రీశ్రీ పూజ్య గురు ఉమేష్ స్వామిజి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల గ్రామంలో శనివారం శ్రీ సువర్చలా సహిత ఆంజనేయస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీశ్రీశ్రీ పూజ్య గురు ఉమేష్ స్వామిజి పంచముఖ హనుమాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్బంగా స్వామివారికి పంచామృత అభిషేక పూజ, సహస్రనాగ వల్లిదలర్చన పూజ కార్యక్రమం నిర్వహించారు. 108 దంపతులచేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి యంత్రానికి పంచామృత అభిషేక పూజా కార్యక్రమం, మన్యసూక్త పూజహోమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ హోమ పూజలు చేయడం ద్వారా ప్రజలు పిల్ల పాపలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, రైతులు పాడి పంటలతో సర్వం సిద్ధిస్తుందని అన్నారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే హనుమాన్ దీక్ష స్వాములు మాల విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి, చిగురుమామిడి గ్రామ ప్రజలు, చుట్టూ ఇతర గ్రామలా ప్రజలు వచ్చి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.