సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు నంబూరి శేషగిరిరావు

సిరా న్యూస్,మాచర్ల;
ఎమ్మెల్యే పిన్నెల్లీ బాధితుడు నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు.పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉంది.
పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలని పిటిషన్ వూసారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారు. అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది. తీవ్ర ఘటనలైనా బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోంది. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. పిన్నెల్లి లేకున్నా.. ఆయన ఏజెంట్ కౌంటింగ్ పరిశీలించే అవకాశం ఉంది.
పిన్నెల్లి నుంచి తనను రక్షించాలని న్యాయస్థానాని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *