పవన్ గెలువాలని… మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన యువతి

సిరా న్యూస్,తిరుపతి;
టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ అభిమానులకు హద్దులు ఉండవు. పవన్ పోటోను గుండెలపై టాటూలు వేసుకున్న సంఘటనలు ఉన్నాయి. గతంలో చేతిపై రక్తం వచ్చేలా పవన్ పేరును అభిమానులు రాసుకున్నారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ గెలుపు కోసం ఆయన అభిమానులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ యువతి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. దీంతో పిఠాపునం నుంచి పవన్ ఎంఎల్‌ఎగా గెలవాలని తిరుపతిలో మెకాళ్లపై మెట్లు ఎక్కారు. ఉండ్రాజవరానికి చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి ఆర్‌ఎంపి వైద్యురాలిగా పని చేస్తున్నారు. పవన్ గెలవాలని ప్రతి రోజు దేవుణ్ణి మొక్కుకునేవారు. పిఠాపురం నుంచి పవన్ గెలవాలని మే 25 నుంచి తిరుపతి మెట్లు ఎక్కడం ప్రారంభించింది. ఇవాళ్టి వరకు ఆమె దాదాపుగా 450 మెట్లు ఎక్కానని మీడియాకు తెలిపింది. పార్టీలతో సంబంధం లేకుంగా పవన్‌పై అభిమానంతోనే ఈ పని చేశానని వివరణ ఇచ్చింది. తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్ రావు, భవానీల అనుమతి ఇవ్వడంతోనే తిరుమలకు మొక్కు తీర్చుకుంటున్నానని పేర్కొంది.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *