సిరా న్యూస్, చిగురుమామిడి
బాధిత కుటుంబాలను పరామర్శించిన చాడ వెంకటరెడ్డి
కరీంనగర్ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పలు కుటుంబాలను శనివారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. దుడ్డేల మల్లికాంబ, జున్నూరి శ్రీనివాస్, మేకల మల్లయ్య కుటుంబాలను పరామర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. సీపీఐ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు,సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బోయిని పటేల్, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, సీపీఐ మాజీ గ్రామ శాఖ కార్యదర్శి తమ్మిశెట్టి రవీందర్, మాజీ ఉపసర్పంచ్ తమ్మిశెట్టి ప్రవీణ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విలాసాగరం అంజయ్య తదితరులు ఉన్నారు.