Jogu Ramanna: కాంగ్రెస్ అస‌మ‌ర్థ పాల‌న‌తో తెలంగాణ‌కు క‌రువు:  మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
కాంగ్రెస్ అస‌మ‌ర్థ పాల‌న‌తో తెలంగాణ‌కు క‌రువుమాజీ మంత్రి జోగు రామన్న
* బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌

పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం కరువుకాష్టంగా మారుస్తుందని మాజీ మంత్రివర్యులు జోగు రామన్న మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాతో పాటు అలాగే పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జోగు రామన్నమాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య పాలలను కొనసాగిస్తూ ప్రజలకు కరెంటుతో పాటు నీటి సమస్యలు రైతులకు విత్తనాల కొరత లేకుండా తీర్చేదిద్దడం జరిగిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర కష్టాల్లో చెవి చూపిస్తూ కరెంటు కోతలు, నీటి కొరత, రైతుబంధు రైతు బీమా అందించడంలో పూర్తిగా విఫలమైందని ద్వజ మెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతతో సీఎం సొంత జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని అందుకుందని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి బిజెపికి వెళ్లిపోతారని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా యని,  గతంలో సుష్మ స్వరాజ్ దయ్యమని వల్లించిన తాను నేడు సుస్వాస్వరాజ్ గురించి మాట్లాడటం తన అసలు రూపాన్ని బయటపెట్టడం జరుగుతుందన్నారు . తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సాధనకు కేసీఆర్ ఆధ్యం పోసి ప్రజా సంక్షేమాన్ని అందించడం జరిగిందని అన్నారు. నేడు అదే స్ఫూర్తితో ప్రజా సంక్షేమంలో ఉంటూ ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటూ తెలంగాణ ఉనికి తో పాటు రాష్ట్ర ఆత్మగౌరాన్ని మళ్లీ కాపాడుకుంటామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు రోకండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు అజయ్, ఇ జ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రలాడ్, సాజితుద్దీన్, యూనిస్ అక్బాని, సలీం పాషా, కస్తాల ప్రేమల, కరుణ, తులసి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *