అదుపు తప్పిన డీసీఎం…భారీగా ట్రాఫిక్ జాం

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. మేడ్చల్ పట్టణంలోని సత్యసాయి బంకు వద్ద డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో మిషన్ భగీరథ పైపును డీసీఎం ఢీ కొట్టింది. దీంతో మిషన్ భగీరథ పైప్ పగిలి నీరు వృధాగా పోతుంది. మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్ వెడల్పు పనులు జరుగుతున్నాడంతో డీసీఎం ప్రమాదంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం పూట అవడంతో ఆఫీసులకు స్కూలు వెళ్లాల్సిన వారు భారీ ట్రాఫిక్ జామ్ తో వాహనాదారులు ఇబ్బందులకు గురయ్యారు.బిస్కెట్ కంపెనీ లోడుతో జీడిపల్లి నుండి నగరానికి వెళ్తూ డీసీఎం ప్రమాదానికి గురైంది. ఎవ్వరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు నిమగ్నమయ్యారు.
==============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *