గుండాయిజాన్ని ప్రోత్సయించిన విజిత్ రావు

సిరా న్యూస్,మంచిర్యాల;
ప్రశాంత వాతవరణంకు నెలవైన మంచిర్యాలలో గుండాయిజం, రౌడీయిజం ను పెంచిపోషించింది మాజీ ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ఆయన తనయుడు నడిపెళ్లి విజిత్ రావు కాదా అని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సోమవారం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడారు. దివాకర్ రావు కంటే ముందు ఎమ్మెల్యేలు గా పని చేసిన వారి పాలనలో ఎప్పుడు గొడవలు జరగలేదని ఉప్పలయ్య గుర్తు చేశారు. దివాకర్ రావు ఎమ్మెల్యేగా గెలిచాక ఆయన తనయుడు విజిత్ రావుప్రోత్సాహంతో గుండాలు, రౌడీలు పెట్రేగిపోయారని ఆరోపించారు. గతంలో బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తే దాడులు చేయాలంటూ బీఆరెస్ పార్టీ శ్రేణులను విజిత్ రావు రెచ్చకొట్టడం దివాకర్ రావుకు కనిపించలేదా అని నిలతీశారు. గడప రాకేష్ పై జరిగిన దాడిని తాము కూడా ఖండిస్తున్నామని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావుకు ముడిపెట్టడం దివాకర్ రావు అవివేకానికి తార్కానమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో అనేక దౌర్జన్యాలకు పాల్పడిన రాకేష్ కు దివాకర్ రావు అమాయకుడంటు కితాబు నివ్వడం శోచనీయమని అన్నారు. గడప రాకేష్ తన అనుచరులతో ఓ చిరు వ్యాపారి ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్లు ధ్వంసం చేసి మహిళలపై దాడి చేశాడని అప్పుడు ఎమ్మెల్యేకు దాదాగిరిని దౌర్జన్యాన్ని ఎందుకు ఖండించలేదని ఆయన నిలదీశారు. అంతేకాకుండా తన బర్త్డే రోజున తల్వార్లు తిప్పి దాదాగిరి ప్రదర్శించాడని,అలాగే సురభి హోటల్లోకి చొరబడి దౌర్జన్యం చేసి వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం రాకేష్ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు. అనేక వివాదాల్లో ప్రధాన కారకుడు అయినా రాకేష్ విజిత్ రావుకు ప్రధాన అనుచరుడని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దివాకర్ రావులో ఓర్వలేని తనం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై దివాకర్ రావు విమర్శలు చేయడమే తప్ప మరో పని లేదని బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి మండిపడ్డారు. ప్రజల సమస్యలపై నిరంతరం ఆలోచన చేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు పై ఎన్ని విమర్శలు చేసిన ప్రజలు విశ్వసించబోరని ఆయన స్పష్టం చేశారు. విజిత్ రావు యువకులను చెడు అలవాట్లకు బానిస చేసి తల్లిదండ్రులను క్షోభకు గురి చేశాడని తెలిపారు. దివాకర్ రావు ఓటమి చెందడంతో వారు ఎంతో ఆనందపడ్డారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రేమ్ సాగర్ రావుపై దాడులు చేయించడానికి రాయలసీమ, ఆంధ్ర నుంచి కిరాయి ముఠాను తీసుకురాలేదా అని నిగ్గతీశారు. మంచిర్యాల లో ఎలాంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధి చేయాలనేది ప్రేమ్ సాగర్ రావు లక్ష్యమని ఆయన అన్నారు.ప్రేమ్ సాగర్ రావు పై తప్పుడు ఆరోపణలు చేసిన దివాకర్ రావు వెంటనే ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పాలని తూముల నరేష్ డిమాండ్ చేశారు. ఎక్కడ గొడవలు జరిగినా ప్రేమ్ సాగర్ రావుపై నెపం వేయాలని చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూడా ప్రేమ్ సాగర్ రావు పై అనేక తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ ప్రజలు నమ్మకుండా 67 వేల మెజార్టీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు.
=================================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *