సిరాన్యూస్, ఆదిలాబాద్
ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట పోలీసు బందోబస్తు : ఎస్పీ గౌష్ ఆలం
* 1100 మంది పోలీసు సిబ్బందితో కౌంటింగ్
* విజయోత్సవ ర్యాలీలు, సభలకు అనుమతి లేదు
* మద్యం దుకాణాలు బంద్
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 4న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపు ప్రక్రియ ఉన్నందున లెక్కింపు కేంద్రాల నుండి 1100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఐ లవ్ ఆదిలాబాద్ నుండి మావల పోలీస్ స్టేషన్ వరకు సామాన్యులకు అనుమతి లేదని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో పోటీదారులు, సంబంధిత ఏజెంట్లు, పాసులు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రాలలో బయట ప్రాంతంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోనికి అనుమతులు ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని, సాధారణ ప్రజలు కు అనుమతి లేదని తెలియజేశారు. మంగళవారం మద్యం దుకాణాలు బంద్ చేసినట్లు తెలిపారు.కేఆర్కే కాలనీవాసులు మావల పోలీస్ స్టేషన్ మీదుగా ఉన్న దారిని వాడుకోవాలని సూచించారు. కౌంటింగ్ ముగిసేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.