సిరా న్యూస్,రంగారెడ్డి;
జై చంద్రబాబు జై తెలుగుదేశం నినాదాలతో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ హోరెత్తింది ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన బిజెపి కూటమి విజయదుందుభి మోగించడంతో తెలంగాణలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. మినీ ఆంధ్రప్రదేశ్ గా భావించే కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక్కసారిగా సంబరాలు మిన్నంటాయి వీరికి జనసేన శ్రేణులు జత కలిసాయి. బాణాసంచా కాల్చారు కేక్ కట్ చేశారు స్వీట్లు అభిమానులకు పంచిపెట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు ఫోటోలతో జిందాబాద్ లు కొట్టారు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సైకిల్ను ఎత్తి పట్టుకొని జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు.