సిరా న్యూస్,చొప్పదండి;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు భారీ మెజార్టీతో గెలవడం పట్ల కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గంగాధర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో కూడా తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కొరకు సంక్షేమ పథకాలు చేపట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు వైద భూపతి,కమలాపురం శ్రీపతి రావు, మండల ప్రధాన కార్యదర్శి దొంతుల వేణుగోపాల్,మధు పలువురు తెలుగు దేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.