ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన నివాస ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్..

సిరా న్యూస్,హైదరాబాద్;

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి – మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రతి పౌరునికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గా విజ్ఞప్తి చేస్తున్న,
రాబోయే తరాన్ని పుట్టబోయే పిల్లల్నీ ఆరోగ్యంగా రక్షించుకోవాలన్న మనం పీల్చే శ్వాస స్వచ్ఛంగా రావాలన్న ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి వృక్షంగా మారే విధంగా పెంచే బాధ్యత తీసుకోవాలి.
రాబోయే సమాజాన్ని కాపాడడంలో మనమంతా భాగస్వామ్యం కావాలి.
పిల్లలకు ప్రతి రోజు మొక్కలకు నీళ్ళు పోసే విధంగా అలవాటు చేయాలి.
మనం మన పర్యావరణాన్ని రక్షించుకుంటే ఆ పర్యావరణం మనల్ని రక్షిస్తుంది.
పర్యావరణాన్ని చెడగొట్టే విధంగా చెట్లు కత్తిరించడం మొక్కలు నాటకపోవడం ప్లాస్టిక్ వాడడం వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే కాలుష్యం పెరిగి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరిగి మరణాల సంఖ్య పర్యావరణం కారణంగా పెరుగుతుంది.
తెలంగాణ ప్రతి బిడ్డా ఈ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకొని కలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *