సిరా న్యూస్,పెద్దపల్లి;
రామగుండం కార్పొరేషన్ లోని ఒకటవ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆదర్శనగర్ లో తేదీ:-04-06-2024 మంగళవారం రోజు సాయంత్రం గాలివాన బీభత్సవానికి నిరుపేద కుటుంబమైన బట్టారి మనమ్మ లక్ష్మీపతి వృద్ధ దంపతుల ఇంటి పైకాపు రేకులతో సహా పైపులతో సహా కొట్టుకుపోయి ఎక్కడికి అక్కడ పగిలిపోయినాయి, గాలివాన బీభత్సవానికి ఇంట్లో నిత్యవసర వస్తువులతో పాటు వస్తు సామాగ్రి అంత తడిసి ముద్దయి నిరుపేద కుటుంబం ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ గారు మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారికి తగు సమాచారం అందివ్వడంతో వెంటనే స్పందించిన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ గారి సతీమణి మనాలి ఠాకూర్ ఉదయం బాధిత కుటుంబాలైన బట్టారి మనమ్మ లక్ష్మీపతి దంపతులతో పాటు గున్నాల ఎల్లమ్మ పద్మ తల్లి కూతుర్లు ఉంటున్న ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోవడంతో వారిని ఆప్యాయంగా చేరదీసి మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని అధైర్య పడవద్దని మీకు అన్ని రకాలుగా మేము అండగా నిలుస్తామని కచ్చితంగా మళ్లీ యధావిధిగా జీవనం సాగించేందుకు మా సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని వారికి ఆర్థిక చేయూతను కుటుంబానికి పదివేల చొప్పున అందజేయడం జరిగినది. అనంతరం సంబంధిత విద్యుత్ అధికారులకు స్తంభించిన విద్యుత్తు అంతరాయాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కరెంటు డిపార్ట్మెంట్ వారితో మాట్లాడడం జరిగినది.ధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సంఘటన జరిగిన మరుక్షణమే మానవతా దృక్పథంతో స్పందించి మా బాధను అర్థం చేసుకొని మాకు ఆర్థిక చేయూతను అందించిన మీ మనసు చాలా గొప్పదని శ్రీమతి శ్రీ మనాలి రాజ్ ఠాగూర్ చేసిన ఆర్థిక సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్ గారితో పాటు రామగుండం పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్ గారు, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్,యువజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు సాదు రమేష్, బాయ్,ఎస్సీ విభాగం నాయకులు బట్టారి ప్రణయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి రాజయ్య, మైనార్టీ నాయకులు ఉమర్, బింగి వంశీ, బింగి నరేష్ ఆటో హైమద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.