సిరా న్యూస్,కమాన్ పూర్;
ఐసీడీఎస్ ప్రాజెక్టు రామగుండం అర్బన్ సి డి పి ఓ స్వరూప రాణి, సూపర్ వైసర్ యు ఉష్పలత సూచన మేరకు బుదవారం నాడు ఎన్ టి పి సి, జ్యోతి నగర్, పి టి ఎస్ లోని డి టైప్ క్వార్టర్స్ అంగన్వాడి కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అంగన్వాడి టీచర్ కె సుజాత ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసిటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడి జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం అని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు పాటు పడాలి పిలుపునిచ్చారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కుంటాము అని, ప్రకృతి పట్ల మన కావ్యాన్ని నిర్వహిస్తామని, మన ఊరిని మన ఇంటిలా చూసుకుంటాము అని వ్యర్థ పదార్ధాలతో కంపోస్టు తయారు చేసుకుంటాం అని ప్రతి ఇంటిలో ఆఫీసులో ఇంకుడు గుంతలు నిర్మిస్తామని మరియు మొక్కలని నాటుతామని , ప్లాస్టిక్ వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తామని అని పొడి చెత్త, తడి చెత్తను వేరు చేస్తాను అని కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరం మొక్కలు నటుదాం అని ప్రతిజ్ఞ చెపించారు. ఈ కార్యక్రమంలో డి టైప్ క్వాటర్ అంగన్వాడి టీచర్ కె సుజాత, ఆయ పుష్ప , మదన్ మోహన్ రావు విద్యార్థినిలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.