సిరాన్యూస్, సైదాపూర్:
నూతన బస్సును ప్రారంభించిన డిపో మేనేజర్ డాక్టర్ సిహెచ్. వెంకటేశ్వర్లు
* మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన గ్రామస్తులు
హుస్నాబాద్ టు హుజురాబాద్ వయా సర్వాయిపేట్ గ్రామాల మీదుగా వెళ్ళే నూతన ఆర్టీసీ బస్సును రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంజూరు చేయడం జరిగింది. బుధవారం పెర్కపల్లి గ్రామంలో ప్రజలు ,నాయకులు నూతన బస్సుకు స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి నూతన బస్సును ప్రారంభించి అందులో ప్రయాణించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్- హుజురాబాద్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ ముత్యాల మల్లేష్, గ్రామశాఖ అధ్యక్షుడు కాశవేని రవీందర్,సామాజిక వేత్త జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణగంటి మంజుల మాట్లాడారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూర్ణం ప్రభాకర్ అడిగిన వెంటనే బస్సును మంజూరు చేశారని, మంత్రి ఈ మార్గంలో నూతన బస్సును మంజూరు చేస్తానని గతంలోనే హామీ ఇచ్చారని ఎలక్షన్ కోడ్ వలన ఆగాల్సి వచ్చిందని అన్నారు. మొత్తం రోజుకి 7 ట్రిప్పులు బస్సు నడుస్తుందని, ప్రజలు బైకులు ఆటోలలో ప్రయాణించడం కంటే బస్సులో ప్రయాణించడమే సురక్షితమైన మార్గమని డిపో మేనేజర్ డిసిహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను అడిగిన వెంటనే బస్సును మంజూరు చేశారని, గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే రెగ్యులర్ గా నడిచే బస్సు రద్దయిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ అన్నారు. అనుకోవడం ఆలస్యం ప్రజలకు ఏ సమస్య వచ్చిన త్వరగా స్పందించి మంచి చేసే నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని సామాజిక వేత్త జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించారు ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా తాను గెలిస్తే తప్పకుండా ఆర్టీసీ బస్సును మంజూరు చేస్తానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి గ్రామ శాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ శివదాయల్ సింగ్, సామాజికవేత్త జిల్లా కాంగ్రెస్ నాయకురాలు కర్ణ కంటి మంజుల రెడ్డి, హుస్నాబాద్ కౌన్సిలర్ సరోజన, హుస్నాబాద్ మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, కనుగంటి భిక్షపతి, తిప్పని కనకయ్య, పోతరాజు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ అమృత్ సింగ్, సర్వాయిపేట్ గ్రామశాఖ అధ్యక్షుడు గుండవేని లక్ష్మణ్, గ్రామస్తులు, యువకులు, సీనియర్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.