Kommera Srinivas Reddy: ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలి : ఎంఈఓ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి

సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలి : ఎంఈఓ కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి
* చిగురుమామిడిలో ప్రారంభ‌మైన‌ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట

బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని చిగురు మామిడి మండల విద్యాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసంద‌ర్బంగా అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఈనెల 6 తేదీ నుండి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులలో విద్యాబోధన జరుగుతుందని తల్లిదండ్రులు తప్పకుండా ప్రభుత్వ బడుల్లోనే తమ పిల్లల్ని చేర్పించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,అమ్మ ఆదర్శ కమిటీ లు, యువజన సంఘాలు బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, ఉపాధ్యాయులు కానుగంటి రాజమౌళి, శ్యామయ్య, జోష్ణ శంకరమ్మ, ప్రతిమ, ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, రవీందర్, జ్యోతి, సరోజన, షబానా అజ్మీ, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *