సిరాన్యూస్, సైదాపూర్:
విద్యుద్ఘాతంతో రైతు పోచయ్యకు తీవ్రగాయాలు
సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి పోచయ్య అనే రైతుకు విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం ఉదయం రైతు పోచయ్య నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలింది. రైతు పోచయ్య వెంటనే కింద పడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే 108 కి సమాచారం అందించగా ఆసుపత్రికి తరలించారు.