సిరాన్యూస్, సైదాపూర్
వాటర్ ప్లాంట్ను తనిఖీ చేసిన సూపర్వైజర్ కిష్టయ్య
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో బాలవికాస మినరల్ ప్లాంట్ ను గురువారం బాలవికాస సూపర్వైజర్ కిష్టయ్య తనిఖీ చేశారు. ఈసందర్భంగా వాటర్ ప్లాంట్లోని నీటి నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో ఉండే టీడీఎస్ 110 ఉండాల్సింది 30 మాత్రమే ఉందని అన్నారు. అందులో ఇసుక, బొగ్గులవనాలు, మెమోరియల్ సరిగా పనిచేయడం లేదని తెలిపారు. ఇలాంటి నీటిని తాగడం వలన ప్రజలకు మోకాళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎముకలు అరగడం వంటివి వస్తాయని అన్నారు.