సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వరద నీరు నివారణకు ప్రత్యేకదృష్టి సారించారు. ఈనేపధ్యంలో అయన గురువారం నాడు శేరిలింగంపల్లి జోన్ మదాపూర్ సర్కిల్ లో పలు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ లను పరిశీలించారు. బాట షో రూం, యశోద హాస్పిటల్, శిల్పారామం వద్ద స్తాగ్నేశన్ పాయింట్ లను పరిశీలించారు. వరద నీరు నిలువ కుండా శాశ్వత చర్యలు తీసుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. జారీ చేసారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ స్నేహ శబరుష్, యస్ ఈ శంకర్, డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
=======