సిరాన్యూస్, కడెం
ఫీఎఫ్ డబ్బులు ఇప్పించాలని వేడుకోలు
* ఎమ్మెల్యే తో ఫోన్ ఇన్ కార్యక్రమంలో అటవీ శాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఫీఎఫ్ డబ్బులు ఇప్పించాలని అటవీ శాఖ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నారపాక స్వామి కోరారు. గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా చరవాణిలో సంప్రదించి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని అటవీ శాఖలో 2010 సంవత్సరం నుండి 2015 వ సంవత్సరం వరకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో జీప్ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, బెస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్, వాచర్లుగా దాదాపు 150 మందికి పైగా పనిచేశారని దాంట్లో కొద్దిమందికి మాత్రమే పీఎఫ్ డబ్బులు క్లైమ్ అయ్యాయని, మిగతా వందమందికి పైగా సిబ్బందికి డబ్బులు క్లైమ్ కాలేదని వాపోయారు. ఈ విషయమై కరీంనగర్ ఈపీఎఫ్ ఆఫీసులో సంప్రదించగా నిర్మల్ జిల్లా అటవీ శాఖ డీఎఫ్ఓ ను సంప్రదించి డిజిటల్ కి ఆన్లైన్ చేయవలసిందిగా తెలిపారు. ఈ విషయమై చాలాసార్లు చాలా ఏళ్లుగా డీఎఫ్ఓ ను సంప్రదించగా వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఎంతోమంది డీఎఫ్ఓ లు మారిన 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ సమస్యకు పరిష్కారం లభించలేదని తెలిపారు. స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమస్యల్ని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసారపు రాజేష్ గౌడ్, బెస్ క్యాంప్ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు,