Rajura Satyam: మిషన్ భగీరథ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మిషన్ భగీరథ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో మిషన్ భగీరథ వాటర్ రావడంలేదని కాలనీవాసులు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కు గురువారం ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన మున్సిపల్ చైర్మన్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఈసంద‌ర్బంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ విద్యానగర్ కాలనీకి మున్సిపాలిటీ ఉద్యానవనం పార్కులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ద్వారా మిషన్ భగీరథ నీరు వస్తుంద‌ని, పార్కులో ట్యాంక్ నుంచి వచ్చేటటువంటి పైపు వద్ద గెట్ వాల్ చెడిపోయింది. వాటర్ రాలేవని నూతన గెట్ వాల్ ను ఏర్పాటు చేయించి మరమ్మత్తులు చేయించామని తెలిపారు. మిషన్ భగీరథ నీరు ఎప్పటిలాగే వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , వార్డు ఆఫీసర్ రమేష్ , మున్సిపాలిటీ వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *