సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ఖానాపూర్లో మన పాఠశాల మన అందరి బాధ్యత కార్యక్రమం
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో మన పాఠశాల మన అందరి బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రవేటు స్కూళ్లలో చేర్పించకుండా వార్డులలో దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వా ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ సందీప్, కవిత, అంగన్వాడీ టీచర్స్ ఆర్, విజయ లక్ష్మి, ఆర్ పి రమలక్ష్మి, సిబ్బంది కవశల్యయ తదితరులు పాల్గొన్నారు.