సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి నగరం ఎం.ఆర్.పల్లి సర్కిల్లో తెలుగు యువత, టి.ఎన్.ఎస్.ఎఫ్ నేతలు సంబరాలు చేసుకున్నారు. అభివృద్ధి ఆరంభం అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేసారు. భారీ కేక్ కట్ చేసారు. బై బై వైసీపీ అంటూ నినాదాలు చేసారు.
తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది. రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకెళ్లే వ్యక్తి రాబోతున్నాడు. ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చంద్రబాబు చేస్తారు. 20 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులకు ఇవ్వనున్నారు. ఏపీకి నూతన పరిశ్రమలు రాబోతున్నాయి. వైసిపి అరాచక పాలన తో విసిగిన యువత, టిడిపి అధికారం లోకి రాగానే ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు వెంట రాష్ట్ర ప్రజలు , విద్యార్థి యువత నడుస్తారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు.