ఆయుష్ యోగా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఫరూక్ కు ఘన సన్మానం

సిరా న్యూస్;

ఆయుష్ యోగా కేంద్రం ఆధ్వర్యంలో ఆయుష్ యోగ గురువు ఆనంద్ గురూజీ ఆధ్వర్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో టిడిపి నాయకులు, కౌన్సిలర్ శ్యాంసుందర్ లాల్, మాజీ కౌన్సిలర్ ఎలిశెట్టి హరినాథ్, న్యాయవాది అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఎటువంటి భేషజాలకు పోకుండా సాదా సీదాగా ఉండే వ్యక్తి ఫరూక్ అని, ఎన్ని ఉన్నత పదవులు అలంకరించినా ఒక మామూలు నాయకుడిలాగే ఉండడం ఆయనకే చెల్లిందన్నారు. ఆయన తన సొంత ఆస్తులను నంద్యాల అభివృద్ధికి ఇవ్వడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఫరూక్ మంత్రిగా ఎదిగి నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తూ, తన పదవికి మరింత వన్నె తేవాలని కోరారు. అలాగే ఈనెల 21న యోగా డే సందర్భంగా ఆయుష్ యోగ కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. ఎమ్మెల్యే ఫరూక్ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన ఆనంద్ గురూజీ, కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్ లకు ధన్యవాదాలు తెలుపుతూ నంద్యాల ప్రజల సహకారం మరువలేనిదని, ప్రజలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అలాగే తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన సేవలను వినియోగించుకోవాలని ఫరూక్ కోరారు. అనంతరం ఆనంద్ గురూజీ, కౌన్సిలర్ శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో యోగ సభ్యులు ఫరూక్ ను ఘనంగా శాలువా, పూలమాలలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ గురూజీ సతీమణి సులోచన, యోగా సభ్యులు వసుమతి, నాగరాజు, ఆంజనేయులు, శీను, రాము, టీచర్ జ్యోతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *