సిరాన్యూస్, ఇచ్చోడ
నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి: మండల వ్యవసాయ అధికారి అనుదీప్రెడ్డి
పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని ఇచ్చోడ మండల వ్యవసాయ విస్తరణ అధికారి అనుదీప్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్ పేట్ గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా విత్తనాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు విత్తనాలు, పంటల సాగుపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగినంత వర్షపాతం నమోదు అయ్యాకే రైతులు విత్తనాలను విత్తుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్ లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా దుకాణాల వద్ద బిల్లులు తీసుకోవాలన్నారు. విత్తనాలు కొనుగోలులో దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.