-కలెక్టర్ సుమిత్ కుమార్ ను కోరిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం:
తాడేపల్లిగూడెం పట్టణ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులకు తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తిచేయాలని తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. భీమవరంలోని కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన ఆయన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో అత్యంత ప్రాధాన్యమైన రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పనులను ప్రారంభించేందుకు ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా పట్టణంలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీలా ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆయన కోరారు. గ్రామాల్లో ప్రజలకు సురక్షిత మంచిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచనలకు సానుకూలంగా స్పందించారు.