Tipperu Ramesh:ధర్మసమాజ్ పార్టీ సూచించిన చిహ్నాన్ని ఆమోదించాలి: పార్టీ మండల అధ్యక్షులు తిప్పారు రమేష్

సిరాన్యూస్‌, సైదాపూర్:
ధర్మసమాజ్ పార్టీ సూచించిన చిహ్నాన్ని ఆమోదించాలి: పార్టీ మండల అధ్యక్షులు తిప్పారు రమేష్
* ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత‌

ధర్మసమాజ్ పార్టీ సూచించిన చిహ్నాన్ని ఆమోదించాలని ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పారు రమేష్ అన్నారు. శుక్ర‌వారం సైదాపూర్ మండల ఎమ్మార్వో మంజుల కి ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం పైన సూచనలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ , అందులో డాక్టర్ పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని, అగ్రవర్ణ భూస్వామ్య పెత్తందారు వ్యవస్థపై, అణగారిన వర్గాల రాజ్యం కోసం,వారి హక్కుల కోసం, పోరాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, పండగ సాయన్న, సమ్మక్క సారక్క వీరవనితల యొక్క చిత్రాలను తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంగా ఆమోదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తిప్పారు రమేష్, మోలుగూరి భూపతి, మధు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *