రామోజీరావు కన్నుమూత

సిరా న్యూస్,హైదరాబాద్;
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు. అప్పటివరకు అయనకు వెంటిలేటర్ పై వైద్య చికిత్స కొనసాగింది. ఇటీవలే అయనకు గుండె సంబంధిత వ్యాధుల కోసం స్టెంట్ వేసారు.

రామోజీరావు మృతి పట్ల జాతీయ నేతలు ప్రధానమంత్రి మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, నడ్డా, శరద్ పవర్, నితీష్ కుమార్ తదితరులు సంతాపం తెలియజేసారు. మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం జగన్, లోకేష్, ఏపిసిసి అధ్యక్షుడు షర్మిల, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల తదితరులు కుడా సంతాపం తెలిపారు.అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *