ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లిన వివాహిత మృతి

బంధువుల పిర్యాదు
సిరా న్యూస్,హైదరాబాద్;
సంతానం కొరకు ఐవీఎఫ్ ట్రీట్మెంటుకు వెళ్లిన ఓ మహిళ, వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాత పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బేగంపేట కుందన్బాగ్ కు చెందిన కరుణాకర్, భార్య మేరీ పరిణిత(38) సంతానం కలగకపోవడంతో కె.పి.హెచ్.బి కాలనీలోని డా.నీరజ ఫెర్టిలిటీ సెంటర్ ను సంప్రదించారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందిస్తున్న డా.నీరజ వల్లి, గత నెల 31 వ తేదీన ప్రసాద్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఐవీఎఫ్ ప్రక్రియ ఉందంటూ చికిత్స మొదలుపెట్టి, పరిణితికి హార్ట్ ఎటాక్ వచ్చిందని చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించాలని నర్స్ తెలపటంతో హుటాహుటిన హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త కరుణాకర్ రెడ్డి అంత్యక్రియల అనంతరం డా.నీరజను సంప్రదించి తన. భార్య మరణానికి కారణం అడగగా, ఆమె బేరసారాలు మొదలు పెట్టడటంతో, కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రి వైద్యులు శవపరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు, మెడికల్ ఫైల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని కె.పి.హెచ్.బి సిఐ తెలిపారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *