జనసేన కార్యాలయంలో రామోజీరావుకు నివాళులు అర్పించిన బొలిశెట్టి శ్రీనివాస్

 సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ కార్యాలయంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ఘన నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి జీవించినంత కాలంలో ఏమి సాధించాము ఏమి మంచి పనులు చేసాము ఎంతమందికి మంచి చేశావు అనే మాత్రమే గుర్తుండిపోయేలా రామోజీరావు గారు పని చేశారని, చిన్న స్థాయి నుంచి ఈనాడు అనేక వేల మందికి ఉపాధి కల్పిస్తూ అనేక మంది జీవితాల్లో వెలుగులు చూపించిన మహా నేతగా రామోజీరావు గారు ఉన్నారని అటువంటి ఆయనను కూడా గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు గురిచేసి ఆయన మరణానికి కారణమైనట్టుగా భావిస్తున్నానని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *