సిరా న్యూస్, బోథ్
బోథ్లో కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన జిల్లా జడ్జి ప్రభాకర్ రావు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న కోర్టు భవన నిర్మాణ స్థలాన్ని శనివారం జిల్లా జడ్జి ప్రభాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రభాకర్ రావు మాట్లాడుతూ త్వరలోనే భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట స్థానిక జడ్జి పి.బి హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వామన్ రావు దేశ్ పాండే, అంగత్ కేంద్రీ , న్యాయవాదులు మోహన్ రావు, పంద్రం శంకర్, ఆడేపు హరీష్ , కుమ్మరి విజయ్, జమీర్, దమ్మ పాల్, కోర్టు సూపరింటెండెంట్ శేఖర్ రెడ్డి , ఎస్సై బి రాము ఉన్నారు.