సిరా న్యూస్, బోథ్
గ్రామాల అభివృద్ధికి కృషి : కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని దన్నూర్, నాగపూర్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధన్నూర్ గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి రూపాయలతో ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇన్చార్జి మంత్రి సీతక్క నిధులను మంజూరు చేసిన కృషి చేస్తారని పేర్కొన్నారు. నాగపూర్ గ్రామంలో తాగునీటి నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయా గ్రామాలలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బోథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాళ్ళ ఇంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్, బొందిడి మాజీ సర్పంచ్ గజానంద్, సుభాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిరెడ్డి, అవినీతి రెడ్డి, పూజా రెడ్డి, రాథోడ్ గోవింద్, మోర స్వామి, భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.