Narayana School: కళ్యాణదుర్గంలో నారాయణ పాఠశాలలో పుస్తకాలు సీజ్

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గంలో నారాయణ పాఠశాలలో పుస్తకాలు సీజ్

కళ్యాణదుర్గం పట్టణంలో స్ధానిక నారాయణ కార్పొ రేట్ పాఠశాలలో పుస్తకాలను ఎఐఎస్ఎఫ్ , సీపీఎం నాయకులు మండల విద్యాశాఖ అధికారి ఆధ్వ‌ర్యంలో సీజ్ చేయించారు ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ నిభందనలకు విరుద్దంగా అడ్మిషన్లు చేపడుతూ పుస్తకాలను వేలాది రూపాయలు తో బలవంతంగా తల్లితండ్రులకు విక్రస్తున్నారని, దీనిపై యాజమాన్యం పై మండల విద్యాశాఖ అధికారి విజయభారతి కీ ఫిర్యాదు చేసి సీజ్ చేయించడం జరిగింద‌న్నారు.కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాలు పేరుతో విద్యను వ్యాపారం చేయడానికి చూస్తే ఆందోళన చేస్తామని హెచ్చ‌రించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఫీజులు తీసుకోవాలని పుస్తకాలను‌ కూడా అధిక ధరలకు అమ్మకూడదని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలు పాఠశాలలో ప్రత్యేక బోర్డు ఎర్పాటు చేయాలని కోరారు..ఫీజుల పేరుతో తల్లితండ్రులను ఇబ్బందులు పెడితే ఆందోళన చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ తాలూకా ఉపాధ్యక్షుడు నవీన్,పట్టణ కార్యదర్శి హర్షవర్ధన్, నాయకులు పవన్,మురళి,సిద్దూ,నోవా,హర్ష,భవిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *