3 లక్షల 20 వేల రూపాయల విలువ గల నిషేదిత (BT-3) నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న సిపి టాస్క్ ఫోర్స్

కల్తి, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నిర్మూలించి అన్నదాత కు అండగా నిలవడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ టాస్క్ ఫోర్స్ వరుస దాడులు

సిరా న్యూస్,బీమరం;
ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు సీపీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ , ఎస్సై ఉపేందర్, భీమారం ఎస్ ఐ రాములు , భీమారం వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్ స్టన్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది లతో కలిసి ఈరోజు ఉదయం మంచిర్యాల జిల్లా లోని బీమారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఆవడం x రోడ్ వద్ద ఒక వ్యక్తి మూడు సంచులతో ఆటో కోసం ఎదురుచూస్తూ అనుమానాస్పదంగా కనిపించగా, అతనిని పట్టుకొని సంచులు తనిఖీ చేయగా ఒక క్వింటాలు ఏడు (107 kgs) కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. విచారణ చేయగా అతని పేరు చుండు నాగేశ్వరరావు అని, భీమారంలో కౌలుకు వ్యవసాయం చేస్తానని, గుంటూరు జిల్లాకు చెందిన తాను, కర్నూలులో గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మంచిర్యాల ప్రాంతంలోని అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువచ్చానని, ఆర్టీసీ బస్సు దిగి ఆటో కోసం ఇక్కడ ఉన్నానని తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *