ఎంపీజే
సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పట్టణంలో మూమెంట్ ఫర్ పీస్ & జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్కోట్ ఖదీర్ భాష మాట్లాడుతూ నైరుతి రుతుపవనాల వల్ల కురుస్తున్న వేళ ఖరీఫ్ సాగుకు సిద్ధంగా రైతులు.
రైతుల నట్టేట ముంచి మోసం చేస్తున్న నకిలీ విత్తనాల వ్యాపారులు.
నకిలీ విత్తనాల వల్ల పంట నాశనమై, ఆర్థికకంగా కుదేలౌతున్న రైతాంగం.రైతుల ఆత్మహత్యలకు కారణమౌతున్న నకిలీ వ్యాపారస్తులకు కఠినంగా శిక్షించాలి.నకిలీ విత్తనాలు, పురుగు మందులతో నష్టపోయిన రైతులకు పూర్తి పంట నష్ట పరిహారం ఇవ్వాలి.నకిలీ విత్తనాల వ్యాపారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి..
దేశంలో, రాష్ట్రంలో నకిలీ విత్తనాల వ్యాపారస్తులు రైతుల అమాయకత్వన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయడం ఎక్కువగా తయారైంది. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి చేతికి పంట రాకపోగా, పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ లో రైతులు పంటలు వెయ్యడానికి సిద్ధమైతున్న తరుణంలో మార్కెట్ లో నకిలీ విత్తనాలు రావడం ఎక్కువయ్యాయి. కొన్నింటిని అధికారులు పట్టుకుంటున్న, కొంతమంది వ్యాపారస్తులు రైతుల అమాయకత్వన్ని ఆసరాగా చేసుకుని నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్ముతున్నారు. దీంతో పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా దివాళా తీసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు ముందు జాగ్రత్తగా నకిలీ విత్తనాల వ్యాపారస్తులపై భరతం పట్టాలని యంపిజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ డిమాండ్ చేశారు. అలాగే నకిలీ విత్తనాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే జవాబుదారిగా ఉండి వారికి పూర్తి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, ఇలాంటి వ్యాపారస్తుల షాపుల పర్మిషన్ రద్దు చేసి వారిని కఠినంగా శిక్షించాలని యంపిజే కోరుతుంది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ అబ్దుల్ కలాం, అబ్దుల్లాఅజీజ్ తదితరులు పాల్గొన్నారు.
=========================xxx