బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆద్వర్యం లో స్వీట్ల పంపిణి
`సిరా న్యూస్,హైదరాబాద్ ;
; కేంద్ర మంత్రివర్గంలో 27ఓబీసీ,బడుగు బలహీన వర్గాలకు 47ఎస్సీ,బీసీ, ఎస్టీలకు స్థానం కల్పించడం పట్ల బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం ప్రదానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ బిజెపి రాష్ట్ర కార్యాలయం ఆవరణలో బాణా సంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్బంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ బిసిలు అణగారిన వర్గాల పట్ల ప్రదానమంత్రి నరేంద్ర మోడికి ఉన్న చిత్త శుద్ధికి మంత్రి వర్గం లో సముచిత స్థానం కల్పించడం నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం లో ఓబీసీ మోర్చారాష్ట్ర ప్రదాన కార్యదర్శి నందనం దివాకర్ ,ఉపాధ్యక్షులు సురేందర్ యాదవ్,ప్యారసాని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.