టీడీఎల్పీనేతగా చంద్రబాబు

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో కూటమి నేతలు సమావేశం అయ్యారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.కాగా, అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు.
================31

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *