నీట్ పరీక్ష రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఎస్ టిఏకు నోటీసులు
సిరా న్యూస్,న్యూఢిల్లీ ;
వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యయేట్(నీట్ యూజి) పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లాహ్ తో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. మే 5న జరిగిన నీట్ యూజి పరీక్ష పేపర్ లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టిఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులభం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.‘‘ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాల. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీలు తెరుచుకున్న వెంటనే చెబుతారా?… లేకుంటే ఎంబిబిఎస్ కౌన్సలింగ్ మొదలవుతుంది’’ అని ఎన్ టిఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అమానుల్లాహ్ అన్నారు. స్పందన తెలుపాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి నోటీసలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *