సిరా న్యూస్,సిరిసిల్ల;
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డి సీ ఎం వ్యాన్, బైక్ డీ కొన్నాయి.ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి మండలం మల్లెపల్లె కు చెందిన షేక్ అబ్దుల్, సయ్యద్ చాంద్ గా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో వున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.
=====