ఉపాధ్యాయులు విద్యార్దులకు అవగాహన కల్పించాలి

మంత్రి పొన్నం
సిరా న్యూస్,హైదరాబాద్;
అబిడ్స్ అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ , గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు పాల్గోన్నారు. జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈవో రోహిణి ఇతర ముఖ్య అధికారులు హజరయ్యారు. పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి సన్మానం చేసారు. స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫాం పంపిణీ చేసారు.
మంత్రి మట్లాడుతూ ఈరోజు పాఠశాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్ కి ముందే ప్రభుత్వం తెలంగాణ లో 26 వేల స్కూల్ లకి 11 వందల కోట్ల తో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు విద్యుత్ ,డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని కల్పించాం. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతుంది. ముఖ్యమంత్రి గారు ,నేను మంత్రులు , కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్ళం. రాష్ట్రం లో ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నాం. విద్య కి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు యూనిఫాం , పుస్తకాలు , కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఏం అవసరం ఉన్న తిరుస్తున్నామని అన్నారు.
ఎగ్జామ్ సమయంలో కూడా జిల్లా కలెక్టర్, డీఈవో ఆధ్వర్యంలో ఫలితాలు బాగా రావాలని సమీక్షా సమావేశలు నిర్వహించాం. ఇక్కడ 18 మంది ఉపాధ్యాయులు ,ఉపాధ్యాయేతర సిబ్బంది, 300 మంది విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించారు. డ్రాప్ ఔట్స్ లేకుండా బట్టలు , మధ్యహ్న భోజనం ఇంకా ఏ ఇబ్బందులూ లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిద్దం. విద్యార్థులు మంచిగా చదువుకోవాలి.. విద్యార్థులకు సమాజం గురించి , విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *