సిరాన్యూస్,ఓదెల
విశ్రాంత అటెండర్ చొప్పరి స్వామి గుండెపోటుతో మృతి
35 సంవత్సరాలు మూగజీవులకు సేవ చేసి మూడు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయిన చొప్పరి స్వామి (65) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన చొప్పరి స్వామి 35 సంవత్సరాలు ఓదెల మండల కేంద్రంలో పశు వైద్యశాలలో అటెండర్ గా పని చేశారు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు.మృతుని కుటుంబాన్ని ఓదెల మండల పశు వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి పరామర్శించారు. వీరి వెంట గోపాలమిత్ర సిబ్బంది గోపతి ప్రవీణ్, శ్రీపతి మహేష్, తదితరులు ఉన్నారు.