భక్తులతో కిక్కిరిసి శ్రీశైలం మల్లన్న ఆలయం

ముక్కంటిశుని దర్శనానికి 5 గంటల సమయం

సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైలం కార్తీకమాసం చివరి కార్తీక సోమవారం పైగా ఈరోజుతో కార్తీకమాసం ముగుస్తుండటంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా క్షేత్రానికి తరలివచ్చారు శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఆలయ ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ లో పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు చివరి కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు అలానే నేటి సాయంత్రం కార్తీక మాసం చివరి కార్తీక సోమవారం పురస్కరించుకుని ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు కార్తీక మాసంతం రేపు తెల్లవారుజాము వరకు ఉండటంతో రేపు కూడా శ్రీశైలంలో భక్తుల రద్దీ వుండే అవకాశం కూడా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *