సిరా న్యూస్,పల్నాడు;
పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి ఇరువైపులా ఉన్న పూల, కాయల బండ్ల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దాచేపల్లి మున్సిపల్ కమిషనర్, మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా ఉన్న బండ్లను తొలగించారు వారిని చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. తమ బండ్లను అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. మా వ్యాపారాలు మొత్తం పోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని బ్రతుకులు మావి, అలాంటిది మా వ్యాపారాలు పోవడంతో మాకు ఆత్మహత్యలే దిక్కని వారు అంటున్నారు.