మళ్లీ మొదటికొస్తున్న నీట్…

సిరా న్యూస్;
పేపర్ లీక్’, ‘మాల్‌ప్రాక్టీస్’ ఆరోపణల నేపథ్యంలో నీట్-యూజీ 2024 పరీక్షను మరోసారి నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ప్రతిస్పందనను కోరింది. ‘పరీక్ష పవిత్రత ప్రభావితమైందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.’ దీనిపై ఎన్టీయే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.నీట్-యూజీ 2024, పేపర్ లీకైందని దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పిటిషన్ ఆరోపించింది. పేపర్ లీకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను ఉల్లంఘించిందని, ఇది న్యాయమైన పద్ధతిలో పరీక్ష జరగాలని కోరుకునే వారి ప్రయోజనాలను హరించిందని కోర్టు వెల్లడించింది.కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యూస్ జే నెడుంపర ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. ‘కౌన్సెలింగ్ కొనసాగనివ్వండి, మేము కౌన్సెలింగ్‌ను ఆపడం లేదు’ అని వెకేష్ బెంచ్ న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లా వ్యాఖ్యానించారు.‘పరీక్ష పవిత్రత కోల్పోయిందని, అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని వారు భావిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. జూలై 8 లోగా దీనికి సమాధానం ఇవ్వమని ఎన్టీయే కోరింది. కానీ న్యాయస్థానం కౌన్సెలింగ్‌పై ఎటువంటి ఉపశమనం ఇవ్వలేద’ అని ఫిజిక్స్ వాలా అన్నారు.నీట్ పరీక్షలో అవకతవకలపై పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించాయి. భారత విద్యార్థి సమాఖ్య కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. వందలాది మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. నీట్ లాంటి పరీక్షలు నిర్వహించేందుకు మరింత విశ్వసనీయమైన విధానం రావాలని ఎస్ఎఫ్ఐ సభ్యుడు మరియు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు అవిజిత్ ఘోష్ అన్నారు.అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఓఖ్లాలోని ఎన్టీయే ప్రధాన కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించింది. కేంద్రాల వద్ద భద్రతను పెంచడం, ప్రభుత్వ కేంద్రాల వద్ద పరీక్షల నిర్వహణ, ప్రభుత్వం నియమించిన ఇన్విజిలేటర్లను మోహరించడంతో సహా ఎన్టీయే నిర్వహించే అన్ని పరీక్షల్లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు పిలుపునిచ్చారు.ఎన్టీయే జూన్ 5న నీట్-యూజీ 2024 ఫలితాలను ప్రకటించింది. 67 మంది అభ్యర్థులు 720 మార్కులు ఎలా సాధించారని విద్యార్థులు ప్రశ్నించారు. హర్యానాలోని ఒక కేంద్రం నుంచి ఆరుగురితో పాటు చాలా మంది టాపర్లుగా నిలిచారు. 2023లో 11.44 లక్షల మందితో పోలిస్తే ఈ సారి 13.16 లక్షల మంది అర్హత సాధించారు. ఆ కేంద్రం ప్రకటన అక్రమాలకు సంబంధించిన అనుమానాలను కలిగించింది.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తుంది. క్యాన్సిల్ చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటుందని, అలాగే కౌన్సెలింగ్‌ ప్రక్రియపై స్టేకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షపై వస్తున్న ఆరోపణలకు సమాధానాలు కావాలని ఎన్టీయేను ధర్మాసనం ఆదేశించింది. ఎగ్జామ్‌లో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలంటూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)కి నోటీసులు జారీ చేసింది. కొంతమంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఎందుకు కలపాల్సి వచ్చిందో జూన్ 6న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎన్‌టీఏ వివరణ ఇచ్చింది. అలాగే పరీక్షలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను ఎన్‌టీఏ ఖండించిందికొందరు అభ్యర్థులు పరీక్షా సమయం కోల్పోయినందున 1,563 మందికి అదనపు మార్కులు ఇచ్చినట్లు తెలిపింది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రారంభంలో ఆలస్యం జరిగిందని, దీంతో పరీక్షా సమయాన్ని కోల్పోయామంటూ కొందరు అభ్యర్థులు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. అందువల్ల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, అధికారులతో చర్చించిన అనంతరం పరీక్షా సమయం కోల్పోయిన అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది.కామన్ లా అడ్మిషన్ టెస్టు సందర్భంగా పరీక్షా సమయం కోల్పోయిన విషయంలో, సుప్రీం కోర్టు సూచించిన ఫార్ములానే ఇప్పుడు కూడా వర్తింపజేసినట్లు తెలిపింది.అందువల్లే, విద్యార్థులకు 718, 719 వంటి మార్కులు వచ్చాయి. అలా అదనపు మార్కుల కారణంగా ఆరుగురు 720 మార్కులు సాధించారని తెలిపింది. అలాగే, ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులు రావడం వల్ల మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని పేర్కొంది.పేపర్ లీక్ వంటిదేదీ జరగలేదని ఎన్‌టీఏ కొట్టిపారేసింది.”పరీక్ష నిర్వహణలో రాజీపడేది లేదు” అని పేర్కొంది.ఇతర అవకతవకలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ విధానమని, ఈసారి 30 రోజుల్లోనే పూర్తి చేయగలిగామని ఎన్‌టీఏ పేర్కొంది.ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో 67 మందికి టాప్ 1 ర్యాంక్ వచ్చింది.ఇది చాలా పెద్ద సంఖ్య. జూన్ 4న నీట్ ఫలితాలు విడుదలైన తర్వాతి నుంచి పరీక్ష నిర్వహణ సక్రమంగా లేదంటూ అనేక వాదనలు తెరపైకి వచ్చాయి.వైద్య విద్యలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షే (ఎంట్రన్స్ టెస్ట్) ఈ నీట్.నీట్‌లో మొదటి ర్యాంకు సాధించిన 67 మందిలో ఆరుగురు, హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాశారు. ఎన్ని ప్రశ్నలకు, ఎన్ని మార్కులనే లెక్కలకు అంతుచిక్కని రీతిలో కొందరు విద్యార్థులు మార్కులు సాధించారు.అయితే, ఈ వాదనలను నీట్ పరీక్ష నిర్వహించే ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ ఖండించింది. పరీక్ష పేపర్ లీక్, లేదా పరీక్ష నిర్వహణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న వాదనలను తోసిపుచ్చింది. సకాలంలో పరీక్ష పేపర్ అందని కొందరు విద్యార్థులకు మాత్రమే అదనపు మార్కులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.కానీ, మళ్లీ పరీక్ష నిర్వహించాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై దేశవ్యాప్తంగా పలుచోట్ల న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *