సిరాన్యూస్, కళ్యాణదుర్గం
త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం ముందు బళ్ళారి రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ ను శుక్రవారం కళ్యాణదుర్గం శాసన సభ్యుల అమిలినేనీ సురేంద్ర బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్నారు. అలానే పేదలకు అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ ను కూడ ఆపేసిన చేతకాని ప్రభుత్వం అన్నారు. సీఎం గా నారా చంద్రబాబు నాయుడు కు ప్రమాణస్వీకారం చేసిన 24 గంటల్లోనే చరిత్రలో నిలబడిపోయే 5 సంతకాలు చేసిన ఘనత సిఎం చంద్రబాబు నాయుడు కు దక్కుతుందని తెలిపారు. అందులో ఒకటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం ఫైల్ పై సంతకం చేయటం చాలా సంతోషమని తెలిపారు. అదే విధంగా కళ్యాణదుర్గం లో ఉన్న ఈ అన్నా క్యాంటీన్ ను వచ్చే జులై చివర్లో కానీ, ఆగస్టు మాసంలో కానీ పూర్తి చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.