సిరా న్యూస్,మాదాపూర్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. దారిలో అడ్డంగా ఉందని వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తల పగలగొట్టారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న సిజిఆర్ స్కూల్ హాస్టల్లో వాటర్ నింపుతుండగా ఘటన జరిగింఇ.
తమ వాహనం పోవడానికి లేకుండా అడ్డు పెడతావా అంటూ తిరుపతి రెడ్డికి సంబందించిన కొందరు యువకులు తన తల పగిలేలా కొట్టారని బాధితుడు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ సయ్యద్ సలీం ఆరోపించాడు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు.